అమెరికాలో కరీంనగర్ జిల్లా వాసి మృతి

7 Jun, 2014 05:05 IST|Sakshi
అమెరికాలో కరీంనగర్ జిల్లా వాసి మృతి

చిగురుమామిడి, న్యూస్‌లైన్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముల్కనూర్‌కు చెందిన న్యాలకొండ అభినయ్‌రెడ్డి(22) అమెరికాలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. న్యాలకొండ శ్రీనివాస్‌రెడ్డి, విమల దంపతులకు అభినయ్‌రెడ్డితోపాటు ఓ కూతురు ఉంది. వీరి కుటుంబం 30 ఏళ్లుగా కరీంనగర్‌లోనే నివాసం ఉంటోంది. కరీంనగర్‌లో బీటెక్ పూర్తి చేసిన అభినయ్‌రెడ్డి ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ఇండియానా రాష్ట్రంలోని తెహ్రాట్ అనే ప్రాంతంలో ఉంటున్నాడు. ఈ నెల 4న అక్కడ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లాడు. ఈ నెల 5న ఉదయం 10 గంటల ప్రాంతంలో(భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు) మరణించాడు.

మరిన్ని వార్తలు