హైదరాబాద్: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. జూన్ 1 వరకు రెండు వారాల పాటు అమెరికాలో కేటీఆర్ పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికాలోని పలు కంపెనీల సీఈఓలతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్లో పెట్టుబడులు, ఇతర అంశాలపై ఆయన అక్కడి సమావేశంలో చర్చించనున్నారు. అమెరికాకు చెందిన వివిధ రాష్ట్రాల గవర్నర్లను కేటీఆర్ కలవనున్నారు.