నేపాల్ బాధితులకు కువైట్ వైఎస్సార్‌సీపీ సాయం

7 May, 2015 02:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కువైట్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విభాగం ఆధ్వర్యంలో నేపాల్ భూకంప బాధితులకు ఒక మినీ లారీ ఆహార పదార్థాలు, వస్త్రాలను పంపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కువైట్‌లోని నేతలు, అభిమానులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుని తాము సేకరించిన ఈ సాయాన్ని స్థానిక నేపాల్ రాయబార కార్యాలయంలో అందజేశామని పార్టీ కువైట్ శాఖ కోఆర్డినేటర్ ఇలియాస్ బీహెచ్ హైదరాబాద్‌లో బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ సంయుక్త కోఆర్డినేటర్ ఎం.బాలిరెడ్డి, స్థానిక నేత ఎంవీ నరసారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు