అమెరికాలో హత్యచేసి హైదరాబాద్లో దొరికిపోయాడు

10 May, 2014 17:46 IST|Sakshi

హైదరాబాద్: అమెరికాలో హత్య చేసి పారిపోయిన ఓ నిందితుడు హైదరాబాద్ లో దొరికిపోయాడు. అమెరికాకు చెందిన లివింగ్‌టన్‌ అక్కడ హత్యచేసి పారిపోయి భారత్కు వచ్చాడు. అతనిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. ఎఫ్‌బీఐ రెడ్‌కార్నర్ నోటీసు మేరకు  సీఐడీ అధికారులు లివింగ్‌టన్‌ను ఈ రోజు ఇక్కడ అరెస్ట్ చేశారు.

రెడ్‌కార్నర్‌ నోటీసు:  ఇంటర్‌పోల్‌లో 190 దేశాలకు సభ్యత్వం వుంది. ఒక దేశంలో నేరం చేసిన వ్యక్తి మరో దేశానికి పారిపోతే ఆచూకీ కనుగొనేందుకు ఇంటర్‌పోల్‌ తన సభ్యదేశాలకు రెడ్‌కార్నర్‌ నోటీసు జారీచేస్తుంది. భారత తరపున ఇంటర్‌పోల్‌లో  సీబీఐ ప్రాతినిధ్యం వహిస్తోంది. అందువల్ల ఆ నోటీస్ ఆధారంగా  లివింగ్‌టన్‌ను సిబిఐ అరెస్ట్ చేసింది.

మరిన్ని వార్తలు