చైనా పర్యాటకులతో వెళ్తున్న బోట్‌ మిస్సింగ్‌..

29 Jan, 2017 10:51 IST|Sakshi
మలేసియా కోస్ట్‌ గార్డ్‌ (ఫైల్‌)

సభా: మలేసియాలో 31 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ అదృశ్యమైంది. అందులో సుమారు 28 మంది చైనా పర్యాటకులు ఉన్నారని తెలుస్తోంది. శనివారం సభాలోని కొట కినబాలు నుంచి బయలుదేరిన పడవ, పులావు మెంగలం చేరుకోవాల్సి ఉండగా.. దానితో సంబంధాలు తెగిపోయాయని మలేసియా తీరప్రాంత రక్షణ అధికారులు వెల్లడించారు.

వారం రోజుల పాటు నిర్వహించే చైనా న్యూ ఇయర్‌ వేడుకల ప్రారంభ రోజున.. పర్యాటకులు టూరిస్ట్‌ స్పాట్‌ పులావు మెంగలంకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారికోసం తమ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నామని మలేసియా అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు గాలింపు చర్యలకు ఆటంకంగా ఉన్నాయని తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు