హైదరాబాద్: భూకంప పీడిత నేపాల్కు హైదరాబాద్లోని జాతీయ పోలీసు అకాడమీ(ఎన్పీఏ) రూ.3,57,960 విరాళాన్ని ప్రకటించింది.అకాడమీలోని 42 మంది అధ్యాపకులు, గెజిటెడ్ అధికారులు, 151 మంది ట్రైనీ ఐపీఎస్లు, 472 మంది ఎన్జీవోలు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని ప్రధాన మంత్రి జాతీయ విపత్తు నివారణ నిధి కార్యదర్శికి ఎన్పీఏ అధికారులు అందజేశారు.