నవాజ్‌ షరీఫ్‌ భార్య మృతి

11 Sep, 2018 18:03 IST|Sakshi
బేగం కుల్‌సుమ్‌ (ఫైల్‌ ఫోటో)

క్యాన్సర్‌తో బాధపడుతు లండన్‌లో మృతి

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భార్య బేగం కుల్‌సుమ్‌ షరీఫ్‌ మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె..  2017 నుంచి లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం లండన్‌లో మృతి చెందారు. ఈ మేరకు పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ ప్రెసిడెంట్‌ షహాబాజ్‌ షరీఫ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 1950లో పాకిస్తాన్‌లో జన్మించిన కుల్‌సుమ్‌ 1971లో నవాజ్‌ షరీఫ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నవాజ్‌ షరీఫ్‌, ఆమె కుమార్తె మరియమ్‌ రావాల్పిండిలోని అదిలా జైల్‌లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమె మృతికి పలువురు పాకిస్తాన్‌ జాతీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు