బ్రెజిల్లో డెంగ్యూతో 700 మంది మృతి

7 Oct, 2015 08:12 IST|Sakshi
బ్రెజిల్లో డెంగ్యూతో 700 మంది మృతి

రియోడీజనిరో: డెంగ్యూ వ్యాధి కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకే రికార్డు స్థాయిలో 693 మంది మృతిచెందినట్లు బ్రెజిల్ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అనధికారికంగా ఇంకా ఎక్కువ మంది డెంగ్యూతో మరణించారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సెంట్రల్, సౌత్ అమెరికాలలో ఈ వ్యాధి ప్రభావం చాలా ఎక్కువగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. సాయో పోలో రాష్ట్రంలో ఎక్కువగా ఈ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. 1990 నుంచి ఇప్పటివరకూ సంభవించి మరణాలలో ఈ ఏడాదే అత్యధికమని అధికారికంగా వెల్లడించారు.

మరిన్ని వార్తలు