అట్లాంటిక్ మీదుగా ‘నెట్’ కనె క్షన్

28 May, 2016 01:35 IST|Sakshi
అట్లాంటిక్ మీదుగా ‘నెట్’ కనె క్షన్

వాషింగ్టన్: అమెరికా నుంచి యూరోప్‌కు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా కేబుల్ ద్వారా ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను ఇవ్వాలని మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ సంయుక్తంగా నిర్ణయించాయి. ఇంటర్‌నెట్ సదుపాయాన్ని వేగంగా, సులభతరం చేయడానికే ఈ పనిని చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు సంయుక్తంగా తెలిపాయి.

‘మరియా’ అనే కొత్త కేబుల్ (సెకన్‌కు 160 టెరాబైట్స్ బ్యాండ్‌విడ్త్ వేగంతో) సహాయంతో అత్యధిక వేగంతో ఆన్‌లైన్ సేవలు అందించనున్నామని పేర్కొన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో దీని పనులు మొదలుపెట్టి 2017 అక్టోబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు