ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు.. వైరల్‌

30 Jul, 2019 17:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇద్దరమ్మాయిల లవ్‌స్టోరీ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసినవారంతా చాలా బావున్నాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాకిస్తాన్‌ దేశాలకు చెందిన ఇద్దరు యువతులతో న్యూయార్క్‌లో చేసిన ఈ ఫొటో షూట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. పాకిస్తాన్‌కు చెందిన ముస్లిం ఆర్టిస్ట్‌ సుందాస్ మాలిక్‌, భారత్‌కు చెందిన హిందూ యువతి అంజలి చక్రా ఈ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు.

న్యూయార్క్‌ బ్యాక్‌డ్రాప్‌లో చిరు జల్లులు పడుతుండగా పారదర్శక గొడుగులో ఈ ఇద్దరూ నవ్వుతూ, తుళ్లుతూ.. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ తన్మయత్వ అధర చుంబనంలో ఉన్నట్టుగా ఈ ఫొటోలు తీశారు. ‘ఏ న్యూయార్క్‌ లవ్‌ స్టోరీ’ పేరుతో ఫొటోగ్రాఫర్‌ సరోవర్‌ తన ట్విటర్‌ పేజీలో ఈ చిత్రాలను షేర్‌ చేశాడు. నెటిజనులను అమితంగా ఆకట్టుకోవడంతో సోషల్‌ మీడియాలో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. సుందాస్ మాలిక్‌ కూడా ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేశారు. ఫొటో షూట్‌ చాలా బాగుందని, హృదయానికి దగ్గర ఉందని చాలా మంది పాజిటివ్‌ కామెంట్లు పెట్టారు.
 

మరిన్ని వార్తలు