పసిబిడ్డను కొరికి చంపేసింది

25 Apr, 2016 11:02 IST|Sakshi

శాన్ డియాగో: అమెరికాలో దారుణం జరిగింది. మూడేళ్ల పసిపాపను ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కరిచి చంపేసింది. ఈ సమయంలో ఆ పాప తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలోని శాన్ డియాగోలో స్టాన్ ఫోర్డ్ షైర్ ప్రాంతంలో ఓ దంపతులకు మూడేళ్ల పాప ఉంది. ఆ దంపతులు టీవీ చూస్తుండగా ఆ కుక్క పాపతోపాటే బెడ్ పై ఉంది.

అదే సమయంలో టీవీ చూస్తున్న పాప తల్లి ఒక్కసారిగా బలంగా దగ్గడంతో ఆ చప్పుడుకు కంగారుపడిన కుక్క గాబరాతో పసిబిడ్డను కొరకడం ప్రారంభించింది. ఎట్టకేలకు వారు కుక్క నుంచి ఆ బిడ్డను వేరు చేసి ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఆ కుక్కకు పిచ్చి తగ్గించి పది రోజులపాటు దాని నడవడికను పరీక్షించేందుకు ప్రత్యేక సెల్ లో పోలీసులు వేశారు.

మరిన్ని వార్తలు