దాడి చేయనని హామీ ఇస్తే అణ్వస్త్రాలను త్యజిస్తాం

30 Apr, 2018 02:56 IST|Sakshi

సియోల్‌/వాషింగ్టన్‌: కొరియా యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు అధికార ప్రకటన చేయటంతో పాటు తమ దేశంపై దాడి చేయనని అమెరికా హామీ ఇస్తే అణ్వాయుధాలను త్యజిస్తామని ఉత్తర కొరియా తెలిపింది.  ఇటీవల జరిగిన అగ్రనేతల చారిత్రక సమావేశం సందర్భంగా ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఈ ప్రతిపాదన చేశారని దక్షిణకొరియా అధ్యక్షుడి అధికార ప్రతినిధి యూన్‌ యంగ్‌–చాన్‌ తెలిపారు.

దీంతోపాటు వచ్చే మేలో అణు పరీక్షల ప్రాంతాన్ని మూసి వేయటంతోపాటు ఈ కార్యక్రమానికి అమెరికా, దక్షిణ కొరియా నిపుణులు, మీడియాను ఆహ్వానిస్తామని కిమ్‌ తెలిపారన్నారు. తాము అణ్వస్త్ర వ్యాప్తికి వ్యతిరేకమని, ఈ విషయంలో పారదర్శకతతో ఉన్నామని అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పేందుకే కిమ్‌ ఈ ప్రతిపాదన చేశారని చాన్‌ చెప్పారు. ‘మేం అమెరికాతో తరచుగా చర్చలు జరిపితే, రెండు దేశాల మధ్య విశ్వాసం పెంపొందుతుంది. అప్పుడు యుద్ధ వాతావరణం సమసిపోతుంది. అలాంటప్పుడు మాకు అణ్వాయుధాలతో పనే ముంటుంది?’ అని కిమ్‌ తెలిపారన్నారు.

మరిన్ని వార్తలు