‘మేం 40 ఏళ్లలో ఒక్క బుల్లెట్‌ వాడలేదు’

5 Jun, 2017 15:22 IST|Sakshi
‘మేం 40 ఏళ్లలో ఒక్క బుల్లెట్‌ వాడలేదు’

బీజింగ్‌: భారత ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను చైనా స్వాగతించింది. మోదీ చేసిన వ్యాఖ్యలు శాంతిమార్గానికి అనుకూలంగా ఉన్నయంటూ చైనా పేర్కొంది. గత వారంలో రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘భారత్‌కు చైనాతో సరిహద్దు సమస్య ఉందనేది నిజమే. కానీ, ఈ ఆకారణంగా గడిచిన 40 ఏళ్లలో మేం ఏనాడు ఒక్క బుల్లెట్‌ కూడా కాల్చలేదు’ అని మోదీ అన్నారు.

దీనికి బదులిచ్చిన చైనా ‘ప్రధాని నరేంద్రమోదీ చేసిన పాజిటివ్‌ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం​’ అంటూ చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్‌ తెలిపారు. భారత్‌ తమకు అతిపెద్ద భాగస్వామి అని, మున్ముందు కూడా ఎలాంటి విబేధాలు తలెత్తకుండా చూసుకుంటూ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకుంటామని అన్నారు.

>
మరిన్ని వార్తలు