పరోక్ష యుద్ధానికి ముగింపు పలకాలి: ఒబామా

21 Sep, 2016 07:57 IST|Sakshi
పరోక్ష యుద్ధానికి ముగింపు పలకాలి: ఒబామా

న్యూయార్క్: పరోక్ష యుద్ధానికి పాల్పడుతున్న దేశాలు వాటికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా కోరారు. వివిధ వర్గాలు కలసి జీవించేందుకు అనుమతించకపోతే మానవాళికి అంతులేని నష్టం కలిగించేలా ఉగ్రవాద కుంపటి కొనసాగుతుందని, ఇతర దేశాలకు ఉగ్రవాదం వ్యాపిస్తుందని చెప్పారు. ఐరాస సాధారణ సభ సమావేశంలో మంగళవారం ఎనిమిదో, చివరి ప్రసంగం చేస్తూ... ఉగ్రవాదం, మత హింసలు పశ్చిమాసియాను  అస్థిరతకు గురి చేస్తున్నాయని చెప్పారు. వివిధ మత వర్గాలు లేదా జాతులు కలిసి జీవించకుండా బయటి శక్తులు ఎక్కువకాలం రెచ్చగొట్టలేవన్నారు.

మరిన్ని వార్తలు