హిందూజా గ్రూప్ చేతికి 'ఓల్డ్ వార్ ఆఫీస్' భవంతి

14 Dec, 2014 11:00 IST|Sakshi
హిందూజా గ్రూప్ చేతికి 'ఓల్డ్ వార్ ఆఫీస్' భవంతి

 లండన్: పారిశ్రామిక దిగ్గజం హిందుజా గ్రూప్ లండన్‌లోని చరిత్రాత్మక ఓల్డ్ వార్ హౌస్ భవంతిని 250 ఏళ్లకు లీజుపై తీసుకుంది. ఇందుకోసం ఎంత వెచ్చించినదీ మాత్రం వెల్లడి కాలేదు. 1,100 గదులు ఉన్న ఈ భవంతిని 5 స్టార్ హోటల్, రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ల కింద మార్చాలని హిందుజా గ్రూప్ యోచిస్తోంది.

బ్రిటిష్ పార్లమెంట్, ప్రధాని నివాసానికి దగ్గర్లోని ఈ భవంతిలో 7 అంత స్తులు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అప్పటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ ఈ బిల్డింగ్ నుంచే వ్యూహాలు రచించారు.

మరిన్ని వార్తలు