పాక్‌ అణు క్షిపణి పరీక్ష

19 Nov, 2019 04:48 IST|Sakshi

ఇస్లామాబాద్‌: భూతలం నుంచి భూతలానికి ప్రయోగించగల అణుసామర్థ్య బాలిస్టిక్‌ క్షిపణి ‘షహీన్‌–1’ను  పాక్‌ విజయవంతంగా పరీక్షించింది. సోమవారం పరీక్షించిన ఈ క్షిపణి దాదాపు 650 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. భారత్‌లోని పలు నగరాలు ఈ క్షిపణి పరిధిలోకి వచ్చాయి.  గత ఆగస్టులోనూ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఘజ్నావీ క్షిపణిని పాకిస్తాన్‌ పరీక్షించింది. భారత్‌ కూడా ఇటీవల బ్రహ్మోస్‌ క్షిపణితో పాటు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని–2 క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది.

మరిన్ని వార్తలు