పాక్‌లో ఇళ్లపై కూలిన విమానం  

31 Jul, 2019 03:55 IST|Sakshi
విమానం కూలి ధ్వంసమైన ఇళ్లు

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ సైన్యానికి చెందిన ఒక చిన్న సైనిక విమానం మంగళవారం తెల్లవారుజామున రావల్పిండిలోని నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనిక సిబ్బంది సహా 19 మంది మృతి చెందారు. పాకిస్తాన్‌ ఆర్మీ ఏవియేషన్‌ విమానం మోరా కలు గ్రామ శివారులో కూలడంతో ఐదారు నివాస గృహాలు ధ్వంసం అయ్యాయని పాకిస్తాన్‌ మీడియా విభాగం ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ తెలిపింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం ఐదుగురు సిబ్బంది మరణించారని వెల్లడించింది. అయితే 19 మంది మృతదేహాలను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు స్థానిక సహాయ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అగ్నిప్రమాదం సంభవించింది. 

మరిన్ని వార్తలు