సూసైడ్‌ జాకెట్‌తో పాక్‌ పాప్‌ సింగర్‌

24 Oct, 2019 04:14 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు చెందిన పాప్‌ సింగర్, నటి రబి పిర్జాదా (27) డమ్మీ బాంబులు అమర్చిన  ‘సూసైడ్‌ జాకెట్‌’ తొడుక్కొని ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగింపుకు నిరసనగా ఆమె ఈ చర్యకు పూనుకుంది. మోదీకి హెచ్చరికగా ట్విట్టర్‌లో చేసిన ఈ పోస్టు వైరల్‌ అయింది. దీనిపై కొందరు పాకిస్తాన్‌ పరువు తీస్తున్నావంటూ తిట్టిపోశారు. అనంతరం ఆమె ఆ ఫొటోను తొలగించారు. గతంలో కూడా ఆమె కొండ చిలువలు, మొసళ్ల దగ్గర ఫొటో దిగి వాటిని మోదీపై వదులుతానని వ్యాఖ్యలు చేసింది. అదికాస్తా వైరల్‌ కావడంతో పంజాబ్‌ వణ్యప్రాణి రక్షణ అధికారులు ఆమెకు నోటీసులు పంపారు.  

మరిన్ని వార్తలు