ఇరాన్లో పాక్ జాతీయుడి ఉరితీత

9 Jan, 2016 15:36 IST|Sakshi
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తికి ఇరాన్  ఉరిశిక్షను అమలు చేసింది.  మత్తు మందులను దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నాడని ఆరోపిస్తూ పాక్  జాతీయుడు ఇబ్రాతుల్లాను గురువారం  ఉరి తీసింది.   స్థానికి మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. 
అటు ఈ వార్తలను  అతని కుటుంబ సభ్యులు కూడా  ధృవీకరించారు.  
 
అయితే ఇరాన్ అధికారులు అన్యాయంగా ఇబ్రాతుల్లాను  ఈ కేసులో ఇరికించారని వాపోతున్నారు. ఇంకా మృతదేహం తమకు అప్పగించలేదన్నారు.కాగా డ్రగ్స్  సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలపై బలూచిస్తాన్ ప్రావిన్స్కు చెందిన ఇబ్రాతుల్లాను మూడు నెలల క్రితం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అతనిపై నేరం రుజువు కావడంతోనే  ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
 
>
మరిన్ని వార్తలు