పన్ను పారదర్శక కూటమిలోకి పనామా

28 Oct, 2016 15:16 IST|Sakshi

పారిస్‌: సీమాంతర పన్ను ఎగవేతదారులపై పోరాటానికి ఏర్పడ్డ ప్రపంచ కూటమిలో పనామా దేశం కూడా చేరింది. దీంతో ఈ కూటమిలో దేశాల సంఖ్య 105కు పెరిగింది. ‘పన్ను విషయాల్లో పరిపాలనా పరమైన సహాయంపై బహుపాక్షిక కూటమి’లో సభ్య దేశంగా గురువారం పనామా చేరింది. కూటమిలో సభ్యదేశాలు పన్నులు చెల్లించేవారి సమాచారాన్ని పంచుకుంటాయి.

ఈ ఏడాది ప్రారంభంలో పనామా పేపర్స్‌ లీక్స్‌ పేరుతో అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్టియం పలు కంపెనీల బండారం బయట పెట్టడంతో ఒక్కసారిగా పనామా దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో భారత్‌ 2012లో చేరింది.
 

మరిన్ని వార్తలు