22 కోట్ల విలువైన వాచీల చోరీ

27 Jun, 2016 18:25 IST|Sakshi
22 కోట్ల విలువైన వాచీల చోరీ

పారిస్ (ఫ్రాన్స్): పారిస్లో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.22 కోట్ల విలువ చేసే వాచీలను దుండగులు చోరీ చేశారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఫ్రాన్స్లోకి చిక్ 8వ డిస్ట్రిక్లో ఉన్న ఓ గిడ్డంగిలో చోటుచేసుకుంది. ఇది 'రిచర్డ్ మిల్లే'కు చెందిన అత్యంత ఖరీదైన వాచీలకు సంబంధించిన గిడ్డంగిగా పోలీసులు తెలిపారు. దుండుగులు వాచీలను ఉంచిన లాకర్లతో సహా ఎత్తుకుపోయారు. ప్రపంచంలోనే టాప్ బ్రాండ్లు, పారిస్లోనే ఖరీదైన ఏరియా అయిన ఇక్కడ  లభిస్తాయి.

మరిన్ని వార్తలు