ఐక్యరాజ్యసమితిలో సెప్టెంబర్‌లో మోదీ ప్రసంగం

2 Aug, 2019 03:35 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో భారత ప్రధాని మోదీ మరోసారి ప్రసంగిం చనున్నారు. ఐక్యరాజ్యసమితి 74వ వార్షిక జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్‌ 28వ తేదీ ఉదయం ప్రధాని మోదీ ప్రసంగం ఉండనుంది. ఈ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించే ప్రపంచ దేశాధినేతల షెడ్యూల్‌ను యూఎన్‌ గురు వారం ప్రకటించింది.

దీని ప్రకారం సెప్టెం బర్‌ 24 నుంచి 30 వరకు సాధారణ అసెం బ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమా వేశాల కోసం 112 దేశాల అధ్యక్షులు, 48 మంది ప్రభుత్వాధినేతలు, 30 మంది విదేశాంగ శాఖ మంత్రులు న్యూయార్క్‌ చేరుకోనున్నారు. ఈ పర్యటన లోనే మోదీ మరికొన్ని ఉన్నత స్థాయి సదస్సులకు హాజరు కానున్నారు. మోదీ మొదటిసారి 2014లో ఐరాసలో ప్రసంగించారు.

>
మరిన్ని వార్తలు