హెరాత్: భారత్, అఫ్ఘానిస్థాన్ల సంబంధాల్లో మరో ముందడుగు పడింది. భారత్-అఫ్ఘానిస్థాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ను ప్రారంభించారు. హెరాత్లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనితో కలసి ఆవిష్కరించారు.
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈ రోజు మోదీ ఢిల్లీ నుంచి బయల్దేరి అఫ్ఘాన్ చేరుకున్నారు. హెరాత్లో మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం ఘనితో కలసి మోదీ భారత్-అఫ్ఘానిస్థాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. అప్ఘాన్ పురోభివృద్ధిలో ఇది మరో ముందడుగు అని అన్నారు. గతేడాది డిసెంబర్లో కాబుల్లో అఫ్ఘాన్ పార్లమెంట్ భవనం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు. ఈ డ్యామ్ను ఇరు దేశాల స్నేహబంధం, విశ్వాసంతో నిర్మించినదని పేర్కొన్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోదీ అఫ్ఘాన్తో పాటు స్విట్జర్లాండ్, మెక్సికో, ఖతార్, అమెరికా దేశాలకు వెళతారు.