ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న మోదీ

25 Dec, 2015 07:54 IST|Sakshi
ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న మోదీ

కాబూల్ : రష్యాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ చేరుకున్నారు. కాబూల్లో నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ఈ భవన నిర్మాణానికి భారత్ రూ.710 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. 86 ఎకరాల్లో ఈ భవనాన్ని నిర్మించారు. మొగల్ సంప్రదాయానికి అనుగుణంగా ఈ భవనాన్ని నిర్మించారు.

కాబుల్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ భారత్ చేరుకుంటారు. న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగిన మోదీ నేరుగా మాజీ ప్రధాని  వాజ్ పేయ్ నివాసానికి చేరుకుంటారు. వాజ్ పేయ్ కి మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు.

మరిన్ని వార్తలు