ఈక్వెడార్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక

17 Apr, 2016 07:32 IST|Sakshi
ఈక్వెడార్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక

ఈక్వెడార్‌ రాజధాని క్వీటోను కుదిపేసిన భారీ భూకంపం
♦ భూకంప ధాటికి 28 మంది దుర్మరణం
♦ రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదు
♦  తొలుత భూకంప తీవ్రత 4.8 గా నమోదు
తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికల జారీ

ఈక్వెడార్‌: ఈక్వెడార్‌ రాజధాని క్వీటోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్టు అమెరికా జీయోలాజికల్‌ సర్వే వెల్లడించింది. రాజధాని క్వీటోలో భూప్రకంపనల తీవ్రత బలంగా ఉండటంతో అక్కడి ప్రాంతీయ తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో శనివారం (స్థానిక కాలమానం)11. 58 గంటల ప్రాంతంలో భారీగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఈ  భూకంప ధాటికి 28 మంది దుర్మరణం చెందినట్టు పేర్కొంది.

క్వీటోకు పశ్చిమ-వాయువ్యంగా 173 కిలోమీటర్ల దూరంలో 11.58 గంటల ప్రాంతంలో ఏర్పడగా, మరో చోట ఆగ్నేయ దిశగా మూస్నేకు 28 కిలోమీటర్ల దూరంలో భూప్రకపంనలు చోటుచేసుకున్నట్టు పేర్కొంది. 11 నిమిషాల కాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో రెండు భూకంపాలు కుదిపేసినట్టు యూస్‌జీయస్‌ వెల్లడించింది. తొలుత భూకంప తీవ్రత 4.8 గానూ, రెండో భూకంప తీవ్రత 7.8 గా నమోదైనట్టు తెలిపింది. ఈ భూకంప ధాటికి క్వీటోలో భవనాలు ధ్వంసం కాగా, 28 మంది మృత్యువాత పడినట్టు ఆ దేశ ఉపాధ్యక్షుడు జార్జ్‌ గ్లాస్‌ పేర్కొన్నారు. గుయాస్‌లో ఇద్దరు, పోర్ట్‌వ్యిజో నగరంలో 16 మంది, మాంటాలో 10 మంది మృతిచెందినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు జార్జ్‌ పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

కాగా, జపాన్‌లో రెండ్రోజుల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ భూకంప ధాటికి మృతుల సంఖ్య 41కు పెరిగగా, 1500 మంది గాయపడ్డారు. క్యుషు ద్వీపంలోని కుమమొటో ప్రాంతాన్ని శనివారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం) 1.30 నిముషాలకు మరో భూకంపం కుదిపేయడంతో 32 మందికి మరణించిన సంగతి విధితమే.

>
మరిన్ని వార్తలు