ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 6.5 కోట్ల మంది శరణార్థులు, వలసదారుల జీవితాలను కాపాడేందుకు కీలక తీర్మానాన్ని 193 దేశాల నేతలు సోమవారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో ఆమోదించారు. శరణార్థుల సంఖ్య పెరగడంతో దేశాలు ఈ సమస్యను తీవ్రమైనదిగా పరిగణిస్తున్నాయి. అయితే తీర్మానానికి చట్టబద్ధత లేదు. శరణార్థుల హక్కులను కాపాడాలని, పునరావాసం కల్పించాలని తీర్మానంలో కోరారు. దీని ఆమోదంతో ఎక్కువ మంది పిల్లలు పాఠశాలలకు వెళ్తారని, ఉద్యోగార్థులు విదేశీ కొలువుల్లో చేరొచ్చని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అన్నారు.