పాక్‌లో రేపిస్టులకు బహిరంగ ఉరి ! 

8 Feb, 2020 01:25 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పిల్లలపై అత్యాచారాలకు, హత్యాచారాలకు పాల్పడే వారికి బహిరంగ ఉరిశిక్ష అమలు చేసే తీర్మానాన్ని పాకిస్తాన్‌ పార్లమెంట్‌ శుక్రవారం ఆమోదించింది. దేశంలో చిన్నారులపై పెరుగుతున్న హత్యాచారాలను నియంత్రించేందుకే ఈ తీర్మానాన్ని తీసుకొస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మొహమ్మద్‌ ఖాన్‌ చెప్పారు. హత్యాచారం చేసే వారికి కేవలం ఉరి సరిపోదని, వారికి బహిరంగ ఉరి వేయాల్సిందేనని తీర్మానం ప్రవేశపెడుతూ ఆయన చెప్పారు.

ఈ తీర్మానం మెజారిటీ ఓట్లతో పాసయింది. అయితే దీనిపై పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ మాత్రం పెదవి విరిచింది. ఈ చర్య ఐక్యరాజ్యసమితి నియమనిబంధనలను ఉల్లంఘించడమేనని చెప్పింది. ఈ చర్య నేరాలను తగ్గించదని చెప్పింది. ఈ తీర్మానాన్ని ప్రభుత్వంలోని సైన్స్‌ శాఖ మంత్రి ఫవాద్‌ చౌధరి, మానవ హక్కుల శాఖ మంత్రి షిరీన్‌ మజారిలు ఖండించారు.  

>
మరిన్ని వార్తలు