చైనాలో భూకంపం: కూలిన ఇళ్లు

11 Jan, 2015 11:39 IST|Sakshi

బీజింగ్: చైనా వాయువ్య ప్రాంతంలోని జింగ్జియాంగ్ ప్రాంతంలో భూకంపం సంభవించిందని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.0గా నమోదు అయిందని తెలిపింది..  భూకంప తాకిడికి 50 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి... దాంతో దాదాపు 1500 మంది నిరాశ్రయులైయ్యారని పేర్కొంది. వారిని సురక్షిత ప్రాంతాలకు ఉన్నతాధికారులు తరలించారని తెలిపింది. భూకంప ప్రాంతంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయని...  భూకంపం వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగినట్లు సమాచారం అందలేదని వెల్లడించింది.

మరిన్ని వార్తలు