స్కాట్లాండ్‌ వాసులకు బ్రిటన్ రాణి సూచన

16 Sep, 2014 01:10 IST|Sakshi

జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి

లండన్: బ్రిటన్ నుంచి స్వతంత్రం ప్రకటించుకునే అంశంపై ఈ నెల 18న స్కాట్లాండ్‌లో జరగనున్న రిఫరెండమ్‌పై బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ ఎట్టకేలకు మౌనం వీడారు. స్కాట్లు ఓటేసే ముందు తమ భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు. ఆమె ఆదివారం స్కాట్లాండ్‌లోని ఓ చర్చిలో తన అభిమానులనుద్దేశించి మాట్లాడారు. రిఫరెండమ్‌లో స్వాతంత్య్రం వద్దని ఓటేసేలా కోరాలని సమైక్యవాదులు తనను కోరడం, ఈ విషయంలో తన జోక్యం కోసం బ్రిటన్ రాజకీయ నేతలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు.

మరిన్ని వార్తలు