‘గాకర్స్‌’ గ్రూపు సీఈవోగా రాజు నరిశెట్టి

23 Sep, 2016 13:30 IST|Sakshi

ముంబై: సీనియర్‌ జర్నలిస్టు, తెలుగువాడైన రాజు నరిశెట్టి గాకర్స్‌ మీడియా గ్రూపు సీఈవోగా నియమితులయ్యారు. దశాబ్దం క్రితం ఈ గ్రూపును ప్రారంభించిన నిక్‌ డెన్టన్‌ స్థానంలో నరిశెట్టి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన ప్రస్తుతం ముర్దోక్‌ కుటుంబానికి చెందిన ‘న్యూస్‌ కార్ప్‌’ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. జర్నలిజంలో అనుభవంతో పాటు డిజిటల్‌ మీడియాపైనా రాజు నరిశెట్టికి మంచిపట్టుంది.

మరిన్ని వార్తలు