రాష్ట్రపతి​కి గునియా అత్యున్నత పురస్కారం

4 Aug, 2019 22:00 IST|Sakshi

గునియా : పశ్చిమ ఆఫ్రికా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను గునియా తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘‘నేషనల్‌ ఆర్టర్‌ ఆఫ్‌ మెరిట్‌’’ను ప్రదానం చేసింది. గునియా అధ్యక్షుడు అల్ఫా కొండే చేతుల మీదుగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ అవార్డు అందుకున్నారు. అవార్డును అందుకున్న సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారత్‌–గునియా దేశాల మైత్రి బంధానికి, గునియా ప్రజల గౌరవానికి ప్రతీకగా అందజేసిన ఈ అవార్డును భారత ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు.

ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు, పరస్పర విశ్వాసం, ఆత్మస్థైర్యానికి పెంచేందుకు, ఆ దిశగా పరస్పరం కలిసి పనిచేసేందుకు ఈ పురస్కారం స్ఫూర్తిగా నిలుస్తుందని కోవింద్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు