సాక్షి, న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు, వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 4,5 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు. ఈ మేరకు శుక్రవారం భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారత్-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పుతిన్ పాల్గోననున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇరు దేశాల నేతల అధినేతలు జూలైలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో చివరి సారిగా భేటీ అయిన విషయం తెలిసిందే.