గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌.. ఏడుగురి మృతి

17 Nov, 2019 18:30 IST|Sakshi

డాకా: ఓ అపార్టమెంట్‌లో సమీపంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై పేలుడు సంభవించిన ఘటనలో ఏడుగురు మరణించారు. మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు. బంగ్లాదేశ్‌నిలోని చిట్టాగాంగ్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనంలో సమీపంలో గ్యాస్‌పైల్‌ లీక్‌ అయి భారీ పేలుడు సంభవించడంంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సహాయ చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గత నెల జరిగిన ఓ గ్యాస్‌ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాజధాని ఢాకా ప్రాంతంలో చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు