రన్వేపై కూలిన విమానం..

11 Oct, 2015 17:47 IST|Sakshi
రన్వేపై కూలిన విమానం..

రన్ వేపై ల్యాండ్ అవుతోన్న సమయంలో జెట్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిన సంఘటన కలకలం రేపింది. అదృష్టవశాత్తు విమానంలో ప్రయాణికులుగానీ, సిబ్బందిగానీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ సంఘటన సింగపూర్ లోని చంగి ఎయిర్ పోర్టులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

ఎయిర్ బస్ ఏ330-300 జెట్ విమానం.. ఉదయం 7:35 గంటలకు హాంకాంగ్ వెళ్లాల్సిఉంది. షాంఘై పుడాంగ్ విమానాశ్రయం నుంచి  తెల్లవారుజామున సింగపూర్ కు చేరుకున్న ఈ విమానానికి తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్ లో సాంకేతిక సమస్య తలెత్తిందని, ఆ సమయంలో లోపల ఒక ఇంజనీర్ మాత్రమే ఉన్నాడని, అతనికి కూడా ఎలాంటిగాయాలు కాలేదని, విమానం ముందుభాగం దెబ్బదినట్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు