ఆరుగురు భారతీయుల అరెస్ట్‌

2 Apr, 2017 19:15 IST|Sakshi
డ్రగ్స్ అమ్ముతూ ఆరుగురు భారతీయులు పట్టుబడ్డారు.
 
కొలంబో(శ్రీలంక): డ్రగ్స్‌ అమ్ముతున్న ఆరుగురు భారతీయుల్ని శ్రీలంక నావీ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 13.5 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ వద్ద బోటులో అనుమానంగా తిరుగుతుండటంతో పెట్రోలు సిబ్బంది పట్టుకున్నట్లు నావీ అధికారులు తెలిపారు.
 
పట్టుబడిన ఆరుగురిని కంకేసతురాయ్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
>
మరిన్ని వార్తలు