స్పెయిన్‌లో 17 వేల కోట్ల లాటరీ

23 Dec, 2019 02:15 IST|Sakshi
గెలిచిన నంబర్‌ను ప్రదర్శిస్తున్న నిర్వాహకులు

బార్సిలోనా: క్రిస్మస్‌ను పురస్కరించుకొని స్పెయిన్‌లో నిర్వహించిన భారీ లాటరీలో 26590 నంబర్‌ టికెట్‌ గెలుపొందింది. లాటరీలో విజేతల ఎంపిక కార్యక్రమాన్ని ఆదివారం ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఎల్‌ గొర్డోగా పిలిచే ఈ లాటరీలో 26590 టికెట్‌ నంబర్‌ కలిగిన వారందరికీ రూ. 3 కోట్లు చొప్పున లభించనున్నాయి. విజేతలు దాదాపు రూ. 60 లక్షలు పన్నుల రూపంలో చెల్లించాలి. ఈ లాటరీ మొత్తం విలువ రూ. 17 వేల కోట్లు.  లాటరీ మొత్తంపరంగా చూస్తే ప్రపంచంలో ఇదే అత్యంత విలువైనది. ఈ లాటరీని 1763లో కింగ్‌ కార్లోస్‌–3 ప్రారంభించారు. ఇందులో వచ్చే డబ్బును కొందరు దానధర్మాలకు కూడా వినియోగిస్తారు.  ఏటా డిసెంబర్‌ 22వ తేదీన ఈ లాటరీ డ్రా తీస్తారు.
 

మరిన్ని వార్తలు