న్యూఢిల్లీ: హత్యానేరాన్ని ఎదుర్కొంటున్నఇటలీ మెరైన్ల తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. ఆరోగ్యకారణాలు చూపి.. ఆ దేశంలో ఉండేందుకు ప్రతీసారి పొడిగింపులు కోరడం సరైనది కాదని స్పష్టం చేసింది. ఇటలీ మెరైన్లకు ప్రత్యేక సౌకర్యాలు ఏమీ ఉండవని ఈ సందర్భంగా సుప్రీం తెలిపింది. క్రిస్మస్ సంబరాలు పురస్కరించుకుని తాను ఇటలీ వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆ దేశ మెరైన్ సల్వటోర్ గిరోని, జనవరి 9 వ తేదీన గుండె ఆపరేషన్ చేయించుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ మరో మెరైన్ మసిమిలియానోలు దాఖలు చేసిన పిటిషన్ల సందర్భంగా సుప్రీం ఈవ్యాఖ్యలు చేసింది.
తక్షణమే ఇటలీ మెరైన్లు దాఖలు అభ్యర్థనలను వెనక్కి తీసుకోవాలని పేర్కొంది. ఆరోగ్య కారణాలు చూపి.. ప్రతీసారి పొడిగింపులు కోరడం సరైన పనికాదని.. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటిది జరుగుతుందా? అని సుప్రీం ప్రశ్నించింది.