చర్చకు రమ్మంటే.. తల నరికిన ఫొటో పంపారు

22 Apr, 2016 12:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్కు ఝలక్ ఇచ్చారు. శాంతి చర్చలకు ఆయన ఆహ్వానం పంపిస్తే తల నరికిన ఫొటోను బదులుగా ఉగ్రవాదులు పంపించారు.

ఇటీవల ప్రపంచ సాంస్కృతిక పండుగను విజయవంతంగా నిర్వహించిన ఆయన అదే ఆశతో ఉగ్రవాద సంస్థతో చర్చలు జరిపి వారిని మార్చాలనుకున్న ఆయన ప్రయత్నం బెడిసికొట్టింది. 'నేను ఇస్లామిక్ స్టేట్ సంస్థతో శాంతియుత చర్చలు జరపాలని అనికున్నాను. కానీ వారు మొండెంతో ఉన్న వ్యక్తి ఫొటోను తీసి పంపించారు. ఇక వారితో శాంతి చర్చలు లేనట్లే' అని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు