-
బెంగళూరు: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఫ్రాన్స్ పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. ఈ నెల 18, 19న పారిస్లోని నేషనల్ అసెంబ్లీ, ఫ్రాన్స్ సెనేట్లలో ప్రసంగించనున్నారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తెలిపింది.
భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, సంక్షోభ పరిష్కారాలు వంటి అంశాలపై ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్ పార్లమెంట్లోని ఉభయసభల్లో ప్రసంగించనున్న తొలి భారతీయుడు ఈయనే. అక్టోబర్ 23న నార్వే పార్లమెంట్లో ఆయన ప్రసంగించనున్నారు.