భారత్లో పాకిస్థాన్ హైకమిషనర్గా సయ్యద్ అబ్బాస్

10 Oct, 2013 14:04 IST|Sakshi

భారత్లో పాకిస్థాన్ కొత్త హైకమిషనర్గా సయ్యద్ ఇబ్నే అబ్బాస్ నియమితులయ్యారు. సల్మాన్ బషీర్ స్థానంలో ఆయనను నియమిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది.

అబ్బాస్ ప్రస్తుతం ఢిల్లీలోని హైకమిషన్ కార్యాలయంలో రాజకీయ సలహాదారుగా పనిచేస్తున్నారు. దీంతో పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయంలో కాశ్మీర్ వ్యవహారాల డైరక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాక్ ప్రభుత్వం అబ్బాస్తో పాటు పలు దేశాలకు తమ రాయబారులను నియమించింది.

మరిన్ని వార్తలు