మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

4 Jun, 2016 22:02 IST|Sakshi
మలేషియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

మలేషియా: కోలాలంపూర్ లోని బ్రిక్ ఫీల్డ్స్ లో మలేషియా తెలంగాణా అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ధూంధాంగా జరిగాయి. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైన ఈ సంబరాల్లో మహిళలు, చిన్నారుల తోపాటు భారీ సంఖ్యలో తెలంగాణా వాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల అట పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సంబరాల్లో భాగంగా మైట సభ్యులు కేక్ కట్‌చేసి నోరు తీపి చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమాన్ని లోటస్ ఈ రేమిట్ స్పాన్సర్‌ చేశారు.

ఈ  కార్యక్రమంలో మలేషియా తెలంగాణా అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదమ్ తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ సోప్పరిస్ సత్య, ముఖ్య కార్యవర్గ సభ్యులు స్టాలిన్, హజారి శ్రీధర్, కృష్ణవర్మ, బురెడ్డి మోహన్ రెడ్డి, అమర్నాధ్, చిట్టి, రవీందర్ రెడ్డి, రఘు, శాంతి, రవి చంద్ర , అజయ్, కార్తీక్, రవివర్మ, ఏబినిజేర్, లక్ష్మికాంత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మైట ఈ సంవత్సరానికీగాను క్రింది నూతన కార్యవర్గ సభ్యులను అధికారికంగా ప్రకటించింది.

ప్రెసిడెంట్ : సైదమ్ తిరుపతి
వైస్ ప్రెసిడెంట్: సోపరిస్ సత్య
సెక్రటరీ: రవి వర్మ
జాయింట్ సెక్రటరీ: చిట్టి  
కోశాధికారి: రఘుపాల్
ముఖ్య కార్యవర్గ సభ్యులు: రవీందర్ రెడ్డి, బురెడ్డి మోహన్ రెడ్డి, రవిచంద్ర, కృష్ణ వర్మ
యూత్ ప్రెసిడెంట్ : స్టాలిన్  
యూత్ వైస్ ప్రెసిడెంట్: చందు
ఈవెంట్: ప్రభాకర్, శ్రీకాంత్, రమణ ,శివ, కృష్ణ వర్మ, రవి, అజయ్ రావు, శ్రీనివాస్, రంజిత్, వేణు గోపాల్, శశిధర్, కిరణ్ గౌడ్, అజయ్ కుమార్ 
ఉమెన్స్ ప్రెసిడెంట్ :  కిరణ్మ్‌యి
అడ్వైజరీ కమిటీ చైర్మెన్: ఎబ్బినిజేర్
అడ్వైజరీ కమిటీ : అమరనాథ్, అశోక్, సురేష్, శాంతి ప్రియ, శ్రీధర్ హజారి

మరిన్ని వార్తలు