భారతీయులు డేటా ఎక్కడ ఉందో చెప్పిన టిక్‌టాక్‌!

6 Jul, 2020 15:30 IST|Sakshi

బీజింగ్‌: దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భద్రతకు ముప్పుగా ఉన్నాయనే కారణంతో 59 చైనా యాప్స్‌ను భారత్‌ నిషేధించిన విషయం తెలిసిందే. వీటిలో షార్ట్‌ వీడియోస్‌ తీసుకోవడానికి ఉపయోగపడే టిక్‌టాక్‌ ఒకటి. చాలా మంది ఈ టిక్‌టాక్‌ ద్వారా వీడియోలు తీసి పాపులారిటి సంపాదించుకున్నారు. టిక్‌టాక్‌ నిషేధానికి సంబంధించిన ఆ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ మేయర్‌  మాట్లాడుతూ, చైనా ఎప్పుడు భారతీయులు డేటా గురించి అడగలేదని, దీనికి సంబంధించి కంపెనీకి ఎప్పుడూ ప్రభుత్వం నుంచి అలాంటి అభ్యర్థనలు రాలేదని తెలిపారు.  ( చైనా.. యాప్స్‌.. ఓ సర్వే) 


అయితే భారతీయులకు సంబంధించిన డేటా అంతా సింగపూర్‌లో ఉన్న సర్వర్లలో ఉందని టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డాన్స్‌ లిమిటెడ్‌ తెలిపింది. అలాగే ఈ సంస్థ భారతదేశంలోనూ డేటా సెంటర్లను నిర్మించాలనుకుంటుందని చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ మేయర్‌ లేఖ ద్వారా ఇండియా కు తెలిపారు. (‘బ్యాన్‌ టిక్‌టాక్’‌ అమెరికాలోనూ..!)

>
మరిన్ని వార్తలు