గత పాతికేళ్లుగా ఇదే వరుస. హజ్ యాత్ర ప్రారంభం అవుతున్న ప్రతిసారి ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎలా ప్రమాదం చోటు చేసుకుంటుందో ఊహించకుండానే జరగాల్సింది జరిగిపోతుంది. మృత్యుఘోష వినిపిస్తోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రలో గత 25 సంవత్సరాలలోనే ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. యాత్రా నిర్వాహకులు ఎంతో అప్రమత్తంగా ఉన్న ఏదో ఒక రూపంలో యాత్రికులను మృత్యువు కభళిస్తోంది. హజ్ యాత్ర కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల నుంచి లక్షల్లో ముస్లింలు వస్తుంటారు.
తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్రను సందర్శించాలని ముస్లింలు కోరుకుంటారు. ఎంతో పవిత్రంగా ఆ కార్యక్రమం పూర్తి చేసేందుకు వారు పెద్ద ఎత్తున తరలి వెళుతుంటారు. అలా వెళ్లిన వారికి నిర్వహణా అధికారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడమో లేక ఏదో ఒక కారణంతో తొక్కిసలాట చోటుచేసుకోవడమో జరుగుతుండటం సర్వసాధరణంగా తయారైంది. ఫలితంగా అదే ప్రాణ నష్టం. వీటికి భిన్నంగా ఇదే నెల 12న మక్కాలోని ఓ భారీ క్రేన్ యాత్రికులపై కూలిపోయి దాదాపు 107 మంది చనిపోవడం, పదిహేను రోజులు తిరగకుండానే తొక్కిసలాట చోటుచేసుకుని 453మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అక్కడి అధికారులనే కాక, యాత్రికులను కూడా తీవ్రంగా కలవర పెడుతోంది.
ఇప్పటి వరకు గత 25 ఏళ్లలో హజ్ యాత్రలో చోటుచేసుకున్న విషాదాలను పరిశీలిస్తే..