ప్రపంచ టెర్రరిస్ట్గా టీటీపీ చీఫ్

15 Jan, 2015 13:29 IST|Sakshi
ప్రపంచ టెర్రరిస్ట్గా టీటీపీ చీఫ్

ఇస్లామాబాద్: పెషావర్ స్కూల్ దాడి ప్రధాన సూత్రధారి, తెహ్రీక్-ఈ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) చీఫ్ ముల్లా ఫజలుల్లాను టెర్రరిస్టుగా  పాకిస్తాన్ ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పర్యటన అనంతరం పాక్  ఈ ప్రకటన చేయటం విశేషం. టీటీపీ చీఫ్ ముల్లా ఫజలుల్లా శనివారం హతమైనట్టు పాకిస్తాన్ మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి.

 

ఈ నేపథ్యంలో పాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పెద్ద దుమారం రేపుతోంది. దీంతో పాటు టీటీపీ, జేయూడీతో సహా మొత్తం పది ఉగ్రవాద సంస్థలపై కూడా పాక్ నిషేధం విధించే యోచనలో ఉంది.
 

మరిన్ని వార్తలు