పథకం ప్రకారమే ఖషోగ్గీ హత్య: టర్కీ

1 Nov, 2018 04:12 IST|Sakshi
జమాల్‌ ఖషోగ్గీ

ఇస్తాంబుల్‌: వాషింగ్టన్‌ పోస్ట్‌ కంట్రిబ్యూటర్‌ జమాల్‌ ఖషోగ్గీని సౌదీ అరేబియా అధికారులు ముందస్తు ప్రణాళికతో పథకం ప్రకారమే హత్య చేశారని ఈ కేసు విచారణలో టర్కీ బృందానికి నేతృత్వం వహించిన అధికారి చెప్పారు. గత నెల 2న ఆయన ఇస్తాంబుల్‌లోని సౌదీ  రాయబార కార్యాలయానికి  రాగానే గొంతు నులిమి చంపేసి, శరీరాన్ని ముక్కలుగా నరికారని అధికారి చెప్పారు. మృతదేహం ఆనవాళ్లు లభించలేదన్నారు. సౌదీ యువరాజుకు వ్యతిరేకంగా వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికలో ఖషోగ్గీ వార్తలు రాసేవారు.

మరిన్ని వార్తలు