ఆఫ్ఘనిస్తాన్ : ఆఫ్ఘనిస్తాన్లో ఓ ఘోర సంఘటన చోటు చేసుకుంది. కాబూల్ ప్రాంతంలో శుక్రవారం ఓ రాజకీయ పార్టీ ర్యాలీ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా జరిగిన బాంబు పేలుడులో 27 మందికి పైగా ప్రజలు అక్కడికక్కడే మృతి చెందారు. అమెరికాతో తాలిబాన్ ఒప్పందాల ఉపసంహరణ తరువాత ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. కాగా, మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి నస్రత్ రహీమి పేర్కొన్నారు.