అమెరికాలో కాల్పులు

21 Dec, 2019 03:51 IST|Sakshi

విన్‌స్టన్‌సేలం: అమెరికాలోని నార్త్‌ కరొలినాలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. విన్‌స్టన్‌ సేలంలోని పబ్లిక్‌ వర్క్స్‌ భవనంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మరణించారని, మరో ఇద్దరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కాల్పులకు పాల్పడిన వారి వివరాలను వెల్లడించలేదు. 

>
మరిన్ని వార్తలు