‘వాన్నా క్రై’ ఉ.కొరియా పనే: అమెరికా

20 Dec, 2017 02:46 IST|Sakshi

వాషింగ్టన్‌: ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 లక్షల కంప్యూటర్లపై జరిగిన వాన్నాక్రై రాన్సమ్‌వేర్‌ దాడి వెనక ఉత్తర కొరియా పాత్ర ఉందని అమెరికా ఆరోపించింది. యూఎస్‌ హోంల్యాండ్‌ భద్రతా సలహాదారు టామ్‌ బోసెర్ట్‌ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు రాసిన వ్యాసంలో సోమవారం ఈ విషయం వెల్లడించారు. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో బహిర్గతంచేసే అవకాశాలున్నాయి. ‘వాన్నాక్రై దాడులు విస్తృతంగా వ్యాపించాయి.

దొంగిలించిన సమాచారాన్ని తిరిగివ్వడానికి బిలియన్ల కొద్ది డాలర్లను డిమాండ్‌ చేశారు. ఇందులో ఉ.కొరియాకు ప్రత్యక్ష పాత్ర ఉంది. మేము ఈ ఆరోపణలు గుడ్డిగా చేయడంలేదు. పక్కా ఆధారాలున్నాయి’ అని టామ్‌ అన్నారు. ఇంటర్నెట్‌ భద్రతను మెరుగుపరిచేలా సైబర్‌ ముప్పును తగ్గించడం కోసం అమెరికా చొరవతీసుకుని ప్రపంచ దేశాలతో కలసిపనిచేయాలని అభిప్రాయపడ్డారు. దశాబ్ద కాలంగా ఉ.కొరియా హద్దులు మీరి ప్రవర్తిస్తోందని ఆరోపించారు.  

>
మరిన్ని వార్తలు