భారత సంతతి పసికందు మృతి

30 Oct, 2016 11:51 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ సమీపంలో జరిగిన వ్యాను ప్రమాదంలో భారత సంతతికి చెందిన నవ్‌రాజ్‌ రాజు అనే ఎనిమిది నెలల పసికందు మృతి చెందాడు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం, బాలుడిని ఆమె తల్లి తనతోపాటు దగ్గర్లోని దుకాణానికి తోపుడుబండిలో తీసుకెళ్లింది.

రోడ్డుపై ఆగి ఉన్న ఒక వ్యాను వెనుక నిలిపి, తోపుడుబండిలోని దుప్పటిని సరిచేస్తోంది. అంతలో రివర్స్‌ తీసుకుంటూ వ్యాన్‌ తోపుడుబండిని ఢీకొనడంతో రాజు వ్యాన్‌ కిందకు పడ్డాడు. వ్యాన్‌ వెనుక టైర్లు రాజు మీద ఎక్కాయి. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి రాజును తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. వ్యాను డ్రైవరును పోలీసులు అరెస్టు చేశారు.
 

మరిన్ని వార్తలు