సాక్షి, వాషింగ్టన్: ఏడుగురు బాలికలను లైంగికంగా వేధించిన కోచ్(44)కు 105 ఏళ్ల జైలు శిక్ష పడింది. కాలిఫోర్నియాలో ఓ ఎలిమెంటరీ పాఠశాలకు కోచ్గా పనిచేస్తున్న రోన్నీ లీ రోమన్.. ఏడుగురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసుపై పలుమార్లు విచారణ నిర్వహించిన లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టు రోన్నీని ఈ ఏడాది జూన్లో దోషిగా తేల్చింది.
2011లో స్కూల్ గ్రౌండ్లో ఆరుగురిపై, మరో బాలిక ఇంటికి వెళ్లి రోనీ అత్యాచారం జరిపినట్లు విచారణలో రుజువైంది. మంగళవారం దోషికి 105 ఏళ్ల జైలు శిక్షను న్యాయమూర్తి ఖరారు చేశారు. న్యాయమూర్తి తీర్పును విన్న రోనీ కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రాణాలతో తాను జైలు గోడలు దాటి బయటకు రాలేనని రోదించాడు.